*నాగార్జున సాగర తీరంలోలోని “బుధ్ధవనం “
“బుద్ధమ్ శరణమ్ గచ్ఛామి
ధమ్మం శరణమ్ గచ్ఛామి..”
బుధ్ధ జననం నుంచి మహభినిష్క్రమణం వరకు
అన్ని దశలతో
బుద్ధవనంనల్గొండజిల్లా,నాగార్జునసాగరం లోవున్న
బుద్ధవనం ప్రాజెక్టు
ఈ బుద్ధ చరిత వనం..అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం.
తెలంగాణకు గొప్పవరం.ఇది ఆసియా ఖండం
లోనే అతిపెద్దబుధ్ధవనం 279ఎకరాల్లోఉంది.
బుద్ధవనానికికేటాయించిన మొత్తం 279ఎకరా
ల్లో ప్రస్తుతం 90 ఎకరాల్లో ప్రపంచదేశాలుసైతం
ఆకర్షించేలా వున్న ఈ ప్రాజెక్టులో బుద్ధ చరిత
వనం,జాతకవనం(బోధిసత్వపార్),ధ్యానవనం
స్థూపవనం, మహాస్థూపం, బుద్ధిజం టీచింగ్,
అండ్ ఎడ్యుకేషన్ సెంటర్, హాస్పిటాలిటీ, వెల్
నెస్ సెంటర్లను ఏర్పాటుచేశారు. 37 ఎకరాల్లో
విపాసన ధ్యాన కేంద్రం ఏర్పాటును విశేషంగా
చెప్పుకోవాలి.ప్రపంచవ్యాప్తంగా 547 జాతక
కథలుంటే….ఇక్కడ భారతదేశంలో దొరికిన
40 ప్రసిద్ధ జాతక కథ శిల్పాలను ప్రతిష్ఠించారు.
భారతదేశంతోపాటు దక్షిణాసియాలోని వివిధ దేశాలకు చెందిన 13 బౌద్ధ స్థూపాల నమూనా
లను ఇక్కడ కనువిందుగా ఏర్పాటుచేశారు.
100 అడుగుల ఎత్తు, 200 అడుగుల వ్యాసం
తో బౌద్ధ స్థూపం, దాని చుట్టూ వేలాది శిల్పాల
నిర్మాణం మయసభను తలదన్నేలా,చూపరు
లను ఇట్టే ఆకట్టుకునేలా వుంది..ఇది మన..
ఆసియా ఖండంలోనే సిమెంట్తో నిర్మించిన
అతి పెద్ద స్తూపం, శ్రీలంక నుండి తీసుకొచ్చిన
27 అడుగుల బుద్ధుడి ప్రతిమను అంగరంగ
వైభవంగా ఇక్కడ ఏర్పాటుచేశారు.స్తూపం గోడ
లపై బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు
శిల్పాలు ఏర్పాటుచేశారు.
*అష్టాంగ మార్గాలకు
ఎనిమిది పార్కులు.!!
బుద్ధుడి అష్టాంగ మార్గానికి గుర్తుగా బుద్ధవనం
లో 8 పార్కులను ఏర్పాటుచేశారు.మొదటిపార్కు
లో బుద్ధుడి జీవిత దశలను తెలిపే నమూనాలు, రెండో పార్కులో 547 జాతక కథలతో 42 రకాల వేదికలు,మూడోది ఆంధ్రా బుద్ధిజం పార్కు,నాలు
గోది ప్రపంచ స్తూపాల పార్కు, ఐదో పార్కులో 27 అడుగుల ఎత్తైన బుద్ధుడి ప్రతిమ,ఆరవపార్కును
ధ్యానవనం, ఏడో పార్కులో మహాస్తూపం, ఎనిమి
దో పార్కును స్తూపవనం ఏర్పాటుచేశారు.
సిద్ధార్ధుడి జననం…లుంబినీవనంలో బుద్ధుడితల్లి
సాలవృక్షం.సిద్దార్ధుడు ఒక్కో అడుగుకు ఒక్కో…
పద్మావిర్భావం..ఇదే నా చివరి జన్మంటూ సిద్ధార్ధు
డు వేలు పైకెత్తి చూపిస్తున్న దృశ్యం,మాయాదేవి
సిద్దార్ధుడికి జన్మనిస్తున్న శిలారూప దృశ్యాలు..
నభూతో నభవిష్యతి అన్నట్లున్నాయి.!!
కడప జిల్లా, జమ్మలమడుగు నుంచి తీసుకొచ్చిన
మల్వాల రాయితో ఇక్కడ శిల్పాలను చెక్కారు. బుద్ధవనంలోకి ప్రవేశించే 3 ప్రధాన మార్గాల వద్ద పల్నాటి పాలరాయిని వాడారు. బుద్ధుడి జీవితం 22 రకాల చెట్లతో ముడిపడి ఉండడంతో ఇక్కడ 22 రకాల చెట్లను పెంచుతున్నారు.
*బుద్ధుడైన విధంబెట్టిదనిన..!!
సిద్ధార్థుడు ఆహారం, నీళ్లుతీసుకో కుండా 48 రోజు
ల పాటు కఠోర సాధన చేసి, హృదేలా గ్రామంలో సుజాతాదేవి ఇచ్చిన పాయసం స్వీకరించినతర్వా
త ఆయనకు జ్ఞానోదయం అవుతుంది. ఈ ఇతి
వృత్తాంతాన్ని ప్రతిబింబిచేలా మహాస్తూపం కింది
భాగంలో మోకాళ్ళ మీద కూర్చుని పాయసంతీసు
కున్నట్లు ప్రతిమను చెక్కారు.
*మరిన్ని విశేషాలు!!
బుద్ధగయనుంచి రావిచెట్టును,శ్రీలంకనుంచి తెచ్చి
న ధమ్మగంటను ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ధర్మచక్ర
పరివర్తన..సార్ నాథ్ జింకల వనం లో శిష్యులతో బుద్ధుడి సమావేశం దృశ్యాలు ఆకట్టుకుంటాయి.
5 పిల్లర్లలో బుద్ధుడి జీవితాన్ని చిత్రీకరించారు.
*స్థూప పార్కు:
ప్రపంచంలో ఉన్న బౌద్ధులు ఒకేచోట స్థూపనమూనా
లు చూసేవిధంగా నిర్మించిన ఈ పార్కులో సాంచీ, సారనాథ్, అజంతా,అమరావతి, కారలే, మాణిక్యా
ల 5 రకాల స్థూపాలనమూనాలు, వివిధ దేశాల్లోని మీర్పూర్ఖాస్(పాకిస్తాన్), అనురాధపుర (శ్రీలంక), పగోడ (చైనా), చోర్టన్(టిబెట్),బౌద్ధనాథ్,(నేపాల్)
తదితర 8 బౌద్ధస్థూపాల నమూనాలతో మొత్తం 13 స్థూపాలు ఉన్నాయి.
*అవకాన బుద్ధ:
శ్రీలంక, తెలుగుప్రజల మధ్యవున్న రెండువేల సంవత్సరాల అనుబంధానికి ప్రతీకగా నాగార్జునకొండలో సింహళ విహారం నిర్మించిన అప్పటి శ్రీలంక ప్రభు
త్వం,దానికి కొనసాగింపుగా బుద్ధవనంలో 27 అడు
గుల ఎత్తైన ఈ బుద్ధ విగ్రహంతోపాటుదమ్మగంటను కూడా ఏర్పాటు చేశారు.!!
*బుద్ధుడి జననం:
బుద్ధుడి జననం గురించి తెలిసేలా ఒక మహావృక్షం కింద మహిళ, ఆమె ముందు బాలుడులో ఒక శిల్పం ఉంది. సిద్ధార్థుడు మాయాదేవికి లుంబినీ వనంలో సాలవృక్షం కింద జన్మించాడని చెప్పడం కోసం ఇది ఏర్పాటు చేయబడింది.!!
బుద్ధచరిత వనం: ..
గౌతమ బుద్ధుడి జీవితానికి సంబంధించిన బుద్ధుడి జననం, మహాభినిష్క్రమణ, తపస్సు చేయడం, ఉపన్యాసం,మరణంవంటి ఘట్టాలను ఇక్కడకంచు
లోహాలతో పొందుపరిచారు. బుద్ధుడు అహింసా మార్గాన్ని ఎంచుకున్న ఘట్టాలు, అడవులకు పోయిన సన్నివేశాలు, బోధివృక్షం కింద జ్ఞానం పొందిన అంశాలకు సంబంధించిన శిల్పాలను ఈపార్కు
లో ఏర్పాటు చేశారు.
*ఆ నలుగురు:
సిద్ధార్థుడు బాహ్య ప్రపంచంలోకి వచ్చిన తరువాత అక్కడ చూసి చలించిన ముసలి వ్యక్తి, రోగి, అంతిమ యాత్రగా వెళ్తున్న వ్యక్తి మృతదేహం, సాధువు శిల్పాలను ఏర్పాటుచేశారు.
*జాతక పార్కు:
బుద్ధుడికి సంబంధించి ప్రపంచంలో వాడుకలో ఉన్న 547 జాతక కథలలో ప్రముఖమైన 42 కథ
లను సేకరించి, వాటిని వివరించే విధంగా శిల్పాల రూపంలో ఈ పార్కులో పొందుపరిచారు.
*మహాస్థూపం..!!
21 మీటర్ల ఎత్తు, 42 మీటర్లవ్యాసంతో ఓ మహా
స్తూపాన్ని నిర్మించారు. కాంక్రీట్తో నిర్మించినస్తూపా
ల్లో ఆసియా ఖండంలోనే ఇది అతిపెద్దది.ఈస్తూప
నిర్మాణానికి, 2000 సంవత్సరాల క్రితంగుంటూరు జిల్లా అమరావతిలోశాతవాహనులకాలంలోనిర్మిం
చిన స్తూప కొలతలను ప్రామాణికంగా తీసుకున్నారు.
ఈ మహాస్థూపం దక్షిణ భారత దేశంలోనే అతి
పెద్దది.మహాస్థూప నిర్మాణంలో అష్టాంగమార్గానికి
గుర్తుగా 8 భాగాలను ఏర్పాటుచేశారు.ఇందులో మ్యూజియం, ఆడిటోరియం, లైబ్రరీ ఉన్నాయి.
ఆసియాలోనే అతి పెద్ద కాంక్రీట్ స్థూప నిర్మాణానికి 128 మంది కళాకారులు పని చేశారు.మహా
స్థూపం డ్రమ్, డ్రోమ్ భాగాలపై క్లిష్టమైన శిల్పాలు…
మహాస్థూపం లోపల ఆకాశం కింద తామర రేకులతో కూడిన వర్చువల్ అద్భుతంగా ఉంటుంది.!
*అహింసాయుతమైన అష్టాంగ మార్గాలు:
గౌతమ బుద్ధుడి జీవితానికిసంబంధించిన అహింసాయుతమైన అష్టాంగ మార్గాలతో బౌద్ధ భిక్షువు
లను, పర్యాటకులను ఆకర్షించేలా ఇక్కడ నిర్మాణాలను చేపట్టారు.
*ఆయకస్తంభాలు..
బుద్ధుడిజీవితంలోనిముఖ్యమైన 5సంఘటనల
నువివరించేలామహాస్తూపానికి నాలుగు వైపులా ఐదేసి చొప్పున ఆయక స్తంభాలనుఏర్పాటు
చేశారు.!!
*సిద్ధార్థుడి జననం:
లుంబినీ వనంలో మాయాదేవికి సిద్ధార్థుడు జన్మించడం.
*మహాభినిష్క్రమణం
నాలుగు విషాదకరమైన సంఘటనలు చూసిన తర్వాత సిద్ధార్థుడు భార్యాపిల్లలు, నగరాన్ని వదిలి తపస్సు కోసం అడవికి వెళ్లడం..!
*జ్ఞానోదయం:
గయలో సిద్ధార్థుడు తపస్సు అనంతరం బుద్ధుడిగా మారడం..!!
*ధర్మచక్ర పరివర్తన:
సారనాథ్లోని మృగధావనంలో బుద్ధుడి మొదటి ఉపన్యాసం..!!
*మహాపరినిర్యాణం:
80వ యేట. బుద్ధుడి నిర్యాణం(మహాభినిష్క్రమణం)