నగ్జల్ బరి నిప్పు రవ్వ నంబాల కేశవరావు

nambala keshava rao died


నంబాల కేశవరావు 1955లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేట గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు. మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన కేశవరావు చిన్నతనంలో కబడ్డీ ఆటగాడిగా గుర్తింపు పొందారు. 1970ల చివరలో గ్రామాన్ని విడిచిపెట్టిన ఆయన కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నారు. ఆయన పేరుమీద ఎలాంటి ఆస్తులు లేవని ఇంటెలిజెన్స్ వర్గాలు ధృవీకరించాయి.


వరంగల్‌లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ (ప్రస్తుతం ఎన్ఐటీ, వరంగల్)లో బీటెక్ పూర్తి చేసిన కేశవరావు, ఎంటెక్ చదువుతుండగా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో చేరి సీపీఐ-ఎంఎల్ (పీపుల్స్ వార్) లో ఆగ్రనేతగా ఎదిగారు.

నంబాల కేశవరావు మావోయిస్టు ఉద్యమంలో గెరిల్లా వ్యూహాలు రచించడంలో, ఐఈడీలతో దాడులు చేయడంలో నిపుణుడిగా పేరొందాడు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతికి కారణమైన దాడిలో, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై 2003లో అలిపిరిలో జరిగిన బాంబు దాడిలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2018లో మావోయిస్టు నాయకుడు గణపతి రాజీనామా తర్వాత, కేశవరావు సీపీఐ-మావోయిస్ట్ సుప్రీం కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

నగ్జల్బరి నిప్పురవ్వలు ఎగిసిపడ్డ శ్రీకాకుళం గడ్డపై కేశవరావు పుట్టాడు.

1980లో శ్రీకాకుళంలో విద్యార్థి సంఘాల ఘర్షణలో ఒక్కసారి అరెస్టయ్యారు, తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు.


బసవరాజు, గంగన్నా, ప్రకాశ్ వంటి మారుపేర్లతో పిలువబడిన కేశవరావు, 1987లో ఎల్‌టీటీఈ యోధుల నుంచి గెరిల్లా శిక్షణ పొందారు. 1992లో సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పీపుల్స్ వార్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, 2004లో సీపీఐ (మావోయిస్ట్) సెంట్రల్ మిలటరీ కమిషన్ అధిపతిగా నియమితులయ్యారు. 2018లో గణపతి రాజీనామా తర్వాత సుప్రీం కమాండర్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఈ ఎన్‌కౌంటర్, ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’లో భాగంగా జరిగింది. ఈ ఆపరేషన్‌లో 27 మంది మావోయిస్టులు హతమైనప్పటికీ, 54 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి, మరో 84 మంది లొంగిపోయారు. ఈ విజయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతోషం వ్యక్తం చేస్తూ, ఎక్స్ వేదికపై ఒక పోస్ట్‌లో, “మన ధైర్యవంతులైన భద్రతా దళాలు, ఏజెన్సీలను అభినందిస్తున్నాను. మోదీ ప్రభుత్వం 2026 మార్చి 31లోపు నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని సంకల్పించింది,” అని పేర్కొన్నారు.
నక్సలిజంపై కేంద్రం దృష్టి


ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. 2023-24లో రూ.1,666 కోట్లు మంజూరు చేయగా, వచ్చే ఏడాది ఈ నిధులను రెట్టింపు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఎన్‌కౌంటర్ విజయం, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో బలహీనపడుతున్న మావోయిస్టు ఉద్యమానికి ఇది గట్టి దెబ్బగా విశ్లేషించారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE