కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, వరంగల్ (KITSW) లో NSS డే–2025 వేడుకలు


వరంగల్, సెప్టెంబర్ 24:
కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (KITSW) లోని సివిల్ సెమినార్ హాల్‌లో నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) డే–2025 వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (SAC) ఆధ్వర్యంలో NSS వాలంటీర్లు నిర్వహించారు.
ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ, KITS వరంగల్ NSS యూనిట్ 40 ఏళ్లుగా సేవా కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తూ, విద్యాసంస్థలను గ్రామీణ ప్రాంతాలతో అనుసంధానించడం ప్రధాన లక్ష్యంగా పని చేస్తోందని తెలిపారు. విద్యార్థి వాలంటీర్ల ఉత్సాహభరితమైన సేవా కార్యక్రమాలు, సాంకేతిక సృజనాత్మకతను ప్రశంసించారు.
మాజీ రాజ్యసభ సభ్యుడు, KITSW చైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మికాంత రావు, KITSW ట్రెజరర్ పి. నారాయణ రెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, KITSW అదనపు కార్యదర్శి వోడితల సతీష్ కుమార్ వాలంటీర్లను అభినందించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి, జిల్లా యువ అధికారి చ. అన్వేష్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం NSS ప్రధాన థీమ్స్ “యూత్ ఫర్ డిజిటల్ ఇండియా,” “యూత్ ఫర్ మై భారత్,” “యూత్ ఫర్ డిజిటల్ లైట్” అని తెలిపారు. 1969 సెప్టెంబర్ 24న NSS ప్రారంభమైందని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం NSS డే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు.
కార్యక్రమంలో KITSW డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ ఎం. శ్రీలత, ఇతర డీన్లు, విభాగాధిపతులు, NSS కోఆర్డినేటర్ డా. చ. సతీష్ చంద్ర, కో–ప్రోగ్రామ్ ఆఫీసర్ కె. సంతోష్ భార్గవి, PRO డా. డి. ప్రభాకర చారి, స్టూడెంట్ కోఆర్డినేటర్ ఎన్. శివ దీపక్, జాయింట్ సెక్రటరీ ఆర్. వత్సల్య, ఎం. శ్రీజని, 130 మందికి పైగా NSS వాలంటీర్లు పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో