సూర్యాపేట జిల్లా ఉప-విభాగపు మిషన్ భగీరథ సహాయక కార్యనిర్వాహక ఇంజనీరు – ఇస్లావత్ వినోద్ లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
ఫిర్యాదుధారునిచేత గతంలో పూర్తిచేయబడిన నారాయణపేట జిల్లా మక్తల్లో మిషన్ భగీరథ పనులకు రూ.20,00,000/- పెండింగ్ బిల్లులను తయారు చేయడానికి లంచం డిమాండ్ చేసాడు. మెజర్ మెంట్ బుక్లో నమోదు చేయడానికి అతని నుండి రూ.1,00,000/- #లంచం తీసుకుంటుండగా తెలంగాణ #అనిశా అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
ఇస్లావత్ వినోద్ గతంలో మక్తల్ లో మిషన్ భగీరథ సహాయక కార్యనిర్వాహక ఇంజనీరుగా పనిచేసి 2024 జులై లో సూర్యాపేటకు బదిలీ అయ్యాడు. ఫిర్యాదుధారుడు పూర్తి చేసిన పనులకు సంబంధించిన Mesurement-పుస్తకాన్ని తన వద్దనే ఉంచుకుని పైసలిస్తేనే రికార్డు చేస్తానని లంచం కోసం డిమాండ్ చేశాడు .
ఏ ప్రభుత్వ అధికారి లేదా ఉద్యోగి అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
ఫిర్యాదు చేసినవారికి వివరాలు గొప్యంగా ఉంటాయని తెలిపారు.