Site icon MANATELANGANAA

కిట్స్ వరంగల్‌లో ఎంబీఏ తొలి సంవత్సరం విద్యార్థుల కోసం ఒరియంటేషన్

వరంగల్‌, అక్టోబర్‌ 13, 2025:
కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌ (కేఐటీఎస్‌), వరంగల్‌ నిర్వహణ విభాగం (ఎంబీఏ) తొలి సంవత్సరం విద్యార్థుల కోసం 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఒరియంటేషన్‌ మరియు ఇండక్షన్‌ ప్రోగ్రాంను సోమవారం సిల్వర్ జూబిలీ సెమినార్ హాల్లో నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రొ. పి. కృష్ణమాచారి ప్రారంభించారు.

మాజీ రాజ్యసభ సభ్యుడు, కేఐటీఎస్‌ చైర్మన్‌ కెప్టెన్‌ వి. లక్ష్మీకాంత రావు, కోశాధి కారి పి. నారాయణ రెడ్డి, అదనపు కార్యదర్శి, మాజీ హుస్నాబాద్ ఎమ్మెల్యే వొదితల సతీశ్ కుమార్‌లు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రొ. పి. కృష్ణమాచారి విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ అంశంపై సదస్సు లో ప్రసంగించారు.

విద్యార్థులు ఆరంభం నుంచే అనుకూలత, మాటల మరియు రచనా నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచన, సమస్యల పరిష్కార సామర్థ్యం, విమర్శనాత్మక ఆలోచనలపై దృష్టి పెట్టాలని సూచించారు.
నాయకత్వం అంటే ఇతరులను ప్రేరేపించడం, శక్తివంతం చేయడం, విభేదాలను సర్దుబాటు చేయడం, సృజనాత్మక వాతావరణాన్ని ఏర్పరచడమని తెలిపారు.
నాయకత్వ లక్షణాలలో భావోద్వేగ చాతుర్యం, నిర్ణయ సామర్థ్యం, స్పష్టమైన సంభాషణ ప్రధానమైనవని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీన్‌ అకడమిక్ అఫైర్స్‌, ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్‌ ప్రొ. కె. వేణుమాధవ్ అధ్యక్ష ప్రసంగం చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు మరియు వ్యాపార ప్రవృత్తి పెంపొందించడానికి అధ్యాపకులు కృషి చేస్తున్నారని తెలిపారు. అకడమిక్‌ నిజాయితీ కాపాడటానికి టర్నిటిన్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నామని చెప్పారు. కేఐటీఎస్‌లోని అన్ని విభాగాలు జాతీయ ప్రమాణ మండలి (ఎన్‌బీఏ), న్యూ ఢిల్లీ నుండి గుర్తింపు పొందినట్లు తెలిపారు.


ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొ. ఎం. కోమల్‌ రెడ్డి, పరిపాలనా అధికారి ప్రొ. పి. రమేష్‌ రెడ్డి, ఎంబీఏ విభాగాధిపతి డా. పి. సురేందర్‌, పీఆర్‌ఓ డా. డి. ప్రభాకర చారి, అధ్యాపకులు డా. జి. రత్నాకర్‌, డా. సునీత చక్రవర్తి, డా. ఎస్‌. సరిక, కె. శశాంక్‌, డా. కె. జైపాల్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సుమారు 60 మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Share this post
Exit mobile version