Site icon MANATELANGANAA

మహానగరంలో ప్రపంచ సుందరీమణుల సందడి

MISS WORLD HYDERABAD

హైదరాబాద్, మే 02, 2025: తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ వేదికపై తన బ్రాండ్ ఇమేజ్‌ను మరింత ఉన్నతంగా నిలపడానికి సిద్ధమవుతోంది.

పోటీలకు హాజరవుతున్న ప్రపంచ సుదరీ మణులు మే 10 నుంచి 31 వరకు హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలో సందడి చేయనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, మే 10 నుంచి 31 వరకు హైదరాబాద్‌లో జరిగే 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ మెగా ఈవెంట్ ద్వారా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక ఆకర్షణలు, మెడికల్ మరియు సేఫ్టీ టూరిజంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కథనాన్ని ప్రపంచానికి చాటనున్నారు.

తెలంగాణ రైజింగ్: ప్రపంచ దృష్టి హైదరాబాద్‌పై
“ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే!” అనే నినాదంతో ఈ ఈవెంట్ రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచి పోవాలని అందుకుతగిన విదంగా ఏర్సాట్లు చేస్తున్నారు.

రు 120 దేశాల నుంచి పోటీదారులు ఈ పోటీలలో పాల్గొననున్నారు. మే 2 నుంచి 8 వరకు పోటీదారులు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేకతలను ప్రదర్శించేందుకు ప్రత్యేక థీమ్‌లు, పర్యాటక సర్క్యూట్‌లు రూపొందించారు.

పోటీల షెడ్యూల్: సంస్కృతి, చరిత్ర, ఆధ్యాత్మికత ప్రదర్శన
మిస్ వరల్డ్ 2025 పోటీలలో భాగంగా వివిధ కార్యక్రమాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగనున్నాయి:

పెట్టుబడుల ఆకర్షణకు సువర్ణావకాశం
మిస్ వరల్డ్ పోటీలను సువర్ణావకాశంగా మలచుకుని, తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఈవెంట్ ద్వారా రాష్ట్ర ఆర్థిక, సాంస్కృతిక, పర్యాటక రంగాలకు ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.

తెలంగాణ సంస్కృతి, చరిత్ర, ఆధ్యాత్మికత, ఆధునికతను సమన్వయంతో ప్రదర్శించే ఈ ఈవెంట్, రాష్ట్రాన్ని అంతర్జాతీయంగా మరింత ప్రముఖంగా నిలపనుంది.

Share this post
Exit mobile version