ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఐబీఎం ఏఐ జెనరేటివ్ ఇంటర్నేషనల్ హ్యాకథాన్లో గ్రాండ్ ప్రైజ్$5000 (1వ బహుమతి) విజేత: యశ్వంత్ కృష్ణ మరియు ఈషా టీం కిట్స్ వరంగల్ విద్యార్థులు
కిట్స్ వరంగల్కు చెందిన పావుశెట్టి యశ్వంత్ కృష్ణ మరియు ఈషా బెల్లాడి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఐబీఎం ఏఐ జెనరేటివ్ ఇంటర్నేషనల్ హ్యాకథాన్లో గ్రాండ్ ప్రైజ్ (1వ బహుమతి) నగదు బహుమతితో ఐదు వేల యు ఎస్ డాలర్లు (4.6 లక్షల రూపాయలు) యశ్వంత్ కృష్ణ మరియు ఈషా గెలుచుకున్నారు.
భారత్ నుంచి ఎంపికైన ఏకైక టీం లో ఇద్దరు విద్యార్థులు కిట్స్ విద్యార్థులు కావడం గర్వ కారణమని ప్రిన్సిపాల్ ప్రొ..కె. అశోకా రెడ్డి తెలిపారు. ఇంటర్నేషనల్ హ్యాకథాన్ లో గ్రాండ్ ప్రైజ్ (1వ బహుమతి) గెలుచుకున్నయశ్వంత్ కృష్ణ మరియు ఈషా లటీం ను అభినందించిన కళాశాల యాజమాన్యం.
ఈ సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా 2000 బృందాలు పాల్గొన్నాయి, అంతర్జాతీయ ఐబీఎం ఏఐ జెనరేటివ్ ఇంటర్నేషనల్ హ్యాకథాన్లో ఇంటెలిజెన్స్ (ఎ ఐ ) వినూత్న అప్లికేషన్లను ప్రదర్శించాయి. వరంగల్లోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (కిట్స్డబ్ల్యు) కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – నెట్వర్క్స్ నుండి యశ్వంత్ మరియు ఈషాల యొక్క కంటెంట్ హాబ్ (Content hub) అనే వినూత్న ప్రాజెక్ట్ గ్రాండ్ విన్నర్ (1వ బహుమతి) గా నిలిచింది.
కంటెంట్ హాబ్ అనేది ఎ ఐ- ఆధారిత ప్లాట్ఫారమ్. ఇది ప్రోగ్రాం డాక్యుమెంటేషన్ నుండి డేటాను తీసుకొని అవసరమైన తీరులోకి మార్చుకొని ప్లాట్ ఫామ్ లలో కి పంపిస్తుంది. కంపెనీ యజమాన్యానికి టైం సేవ్ అవుతుంది. ఈ విశేషమైన విజయంలో భాగంగా, వారు బాగా అర్హమైన $5000 (మూడు వేల అమెరికన్ డాలర్లు) (4.6 లక్షల రూపాయలు)అందుకున్నారు ” అని అన్నారు.
ప్రిన్సిపాల్ ప్రొ..కె. అశోకా రెడ్డి మాట్లాడుతూ ఈ విషయంలో, అద్భుతమైన సాధన కోసం యశ్వంత్ కృష్ణ మరియు ఈషాల గురించి మేము చాలా గర్విస్తున్నామన్నారు. కిట్స్ వరంగల్ సంస్థలో భాగంగా వారి విజయాన్ని ఆనందంగా జరుపుకుంన్నామని తెలిపారు. “వారి కృషి, అంకితభావం మరియు వినూత్న ఆలోచనలు మా ఇన్స్టిట్యూట్ పెంపొందించే అద్భుతమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. కిట్స్ వరంగల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – నెట్వర్క్స్ (సి ఎస్ ఎన్) మరియు సెంటర్ ఫర్ ఐ స్క్వేర్ ఆర్ఈ విభాగాల తరపున, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాలెంజ్, సృజనాత్మకత మరియు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడంలో ప్రసిద్ధి చెందింది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జట్ల భాగస్వామ్యాన్ని చూసింది.
“భారత్ నుంచి ఎంపికైన ఏకైక టీం- ఇద్దరు విద్యార్థులను రాజ్య సభ మాజి సభ్యులు కిట్స్ వరంగల్ చైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు , కోశాధికారి పి.నారాయణరెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ మాజి ఎమ్మెల్యే, కిట్స్ వరంగల్ అడిషనల్ సెక్రెటరీ, వి. సతీష్ కుమార్, ఇతర మేనేజ్మెంట్ సభ్యులు, ప్రిన్సిపల్ ప్రొ.కె. అశోక రెడ్డి శుభాకాంక్షలతో అభినందించారు.
ఇద్దరు విద్యార్థుల సాధించిన ఘనత కిట్స్ వరంగల్కు గర్వకారణం కావడమే కాకుండా భవిష్యత్ తరాల ఆవిష్కర్తలకు పెద్ద కలలు కనడానికి మరియు భవిష్యత్ స్టార్టప్ల కోసం ఒక ప్రేరణగా కూడా ఉపయోగపడుతుంది అని తెలిపారు.
నిర్వాహణ సభ్యులు, వివిధ విభాగాల విభాగాధిపతులు, డీన్ లు, డీన్ అకాడెమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ డా కె వేణు మాధవ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – నెట్వర్క్స్ (సి ఎస్ ఎన్) ఇంచార్జి హెడ్ & ప్రొఫెసర్, డాక్టర్ బి వి ప్రణయ్ కుమార్, యశ్వంత్ కృష్ణ తల్లిదండ్రులు, డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ శ్రీమతి వనిత, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, & పి ఆర్ ఓ డాక్టర్ డి. ప్రభాకరా చారి, ఇద్దరు విద్యార్థులను శుభాకాక్షలతో అభినందించారు.