Site icon MANATELANGANAA

కిట్స్ వరంగల్ – ఎంటూ టెక్నాలజీ సొల్యూషన్స్ మధ్య ఎం.ఓ.యూ

KITS WGLMOU

వరంగల్, మే 22,2025 :
వరంగల్‌కు చెందిన కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) తాజాగా కోయంబత్తూరులోని ప్రముఖ బహుళజాతి కంపెనీ ఎంటూ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక కీలక అవగాహన ఒప్పందం (ఎం.ఓ.యూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై గురువారం సంతకాలు కిట్స్ క్యాంపస్‌లోని కమిటీ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో చే సారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు పరిశ్రమకు అనుగుణంగా శిక్షణ, ఇంటర్న్‌షిప్‌లు, విద్యార్థులలో నైపుణ్యాల పెంపుదల వంటి అవకాశాలు లభిస్తాయి,” అన్నారు. ప్రత్యేకంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – నెట్‌వర్క్స్ విభాగానికి ఇది ఎంతో ఉపయోగపడనుంది అని ఆయన తెలిపారు.

ఎంటూ టెక్నాలజీ వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్ మూర్తి కోనగరాజ్ మాట్లాడుతూ, “మేము పీసీబీ తయారీ, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్లలో విశేష అనుభవం కలిగి ఉన్నామన్నారు. తమ నినాదం ‘బిల్డ్ వి మేక్’ ఆధారంగా విద్యార్థులలో ఆవిష్కరణను ప్రోత్సహిస్తూ అధిక ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తాం,” అని తెలిపారు.

ఈ సందర్భంగా కిట్స్ చైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంత్ రావు, కోశాధికారి పి. నారాయణ రెడ్డి, హుస్నాబాద్ మాజి ఎమ్మెల్యే మరియు అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్ ఈ ఒప్పందాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ K. వేణుమాధవ్, సిఎస్‌ఎన్ విభాగ అధిపతి ప్రొఫెసర్ V. శంకర్, IIIC ఇన్‌ఛార్జ్ డాక్టర్ G. రఘోత్తమ్ రెడ్డి, ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ G. సునీల్ కుమార్, పీఆర్ఓ డా. డి. ప్రభాకరాచారి, ఇతర డీన్‌లు, అధ్యాపకులు, సిబ్బంది మరియు ఎంటూ టెక్నాలజీ బృందం పాల్గొన్నారు.

Share this post
Exit mobile version