Site icon MANATELANGANAA

జనగాం లో లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన ఇంజనీర్

జనగాం జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర విద్యా & సంక్షేమ మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో క్షేత్ర ఇంజనీర్ గా పొరుగు సేవల పై పనిచేస్తున్న ఉద్యోగి సామల రమేష్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.

ఫిర్యాదుదారుడు ప్రధానమంత్రి శ్రీ యోజన పథకం క్రింద పూర్తిచేసిన నిర్మాణ పనులకు సంబంధించిన చివరి బిల్‌ను ప్రాసెస్ చేసి తదుపరి చర్యల కోసం పంపించేందుకు అధికారిక సహాయం అందించాలన్న కారణంగా, రమేష్ మొదటగా రూ.18,000 లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

అందులో ముందుగానే రూ.10,000 తీసుకున్న రమేష్, మిగతా రూ.8,000 తీసుకుంటూ 25.09.2025 భాధితుని ఫిర్యాదుతో, తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు.

ప్రజలకు అవినీతి నిరోధక శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తూ, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగినపుడు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయాలని కోరారు. అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Share this post
Exit mobile version