రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం….
ఒక్క ఏడాదిలోనే 21వేల కోట్ల రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది….
పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం….
రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి….
డిసిసి బ్యాంక్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి…..
అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్
బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది
దేశ చరిత్రలో ఏకకాలంలో 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే
కాంగ్రెస్ పాలనలో మహిళా స్వయం సహాయ సంఘాలకు రుణాలు
డీసీసీ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి
డిసిసి బ్యాంకు నూతన బ్రాంచ్, గోదాంను ప్రారంభించిన వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య , ఎమ్మెల్యే కడియం శ్రీహరి
రైతు సంక్షేమమే ద్యేయంగా ఒక్క ఆర్థిక సంవతంలోనే వ్యవసాయ రంగానికి 30వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
ధర్మసాగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 2వేల మెట్రిక్ టన్నుల గోదాం, డీసిసి బ్యాంక్ ధర్మసాగర్ బ్రాంచ్ నూతన భవనం, కామన్ సర్వీస్ సెంటర్, గోదాం ప్రారంబొత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెని రవీందర్ రావు తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య , ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం పాటుపడుతున్న విషయాన్నీ రైతులు గుర్తించాలని కోరారు. ఒక్క ఏడాదిలోనే 25లక్షల మంది రైతులకు 21వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేద కుటుంబం ఆకలితో ఉండకూడదు అని రేషన్ షాప్ ల ద్వారా ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని అన్నారు.
సన్నాలు పండించే రైతులను ప్రోత్సహించాలని 500బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు 40లక్షల మంది రైతులకు 4వేల కోట్లు బ్యాంక్ ఖాతాలలో జమ అయ్యాయని రానున్న వారం రోజులలో 90లక్షల మంది రైతులకు 9వేల కోట్లు అందనున్నాయని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ మొతంగా 30వేల కోట్లు కేటాయించిందని వివరించారు. రైతులకు అండగా ఉంటూ రైతు సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రజలకు అవినీతి రహితమైన పాలన అందించడం, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే నా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు సహకరించాలని కోరారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో డీసిసి బ్యాంక్ సేవలను, పీఏసీఎస్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ…..
అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుంది అని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగాలని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయాన్ని పండుగ చేయ డానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందులో భాగంగా రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, పంటల బీమా తదితర పథకాలతోయూ రైతన్నలను ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు సాధించారని గుర్తు చేశారు.
అంతేకాకుండా బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు
రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సహకార సంఘ అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ రుణాలన్ని సెంట్రల్ బ్యాంక్ ద్వారా సహకార సంఘాలకు అందజేయడం జరుగుతుందన్నారు. సెంట్రల్ బ్యాంక్ కల్పించే బ్యాంకు సౌకర్యాలను సద్వినియోగపరుచుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలని అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. రైతులు, మహిళలు డీసీసీ బ్యాంకు సేవలను ఉపయోగించుకోవాలని ఎంపీ సూచించారు.
ఈ కార్యక్రమంలో హన్మకొండ డీసివో సంజీవ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుండ్రేడ్డి రాజేశ్వర్ రెడ్డి, వరంగల్ డీసిసిబి బ్యాంక్ సిఈవో వజీర్ సుల్తాన్, తహసీల్దార్ సదానందం, ఎంపీడివో అనిల్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుమారస్వామి, ఏవో రాకేష్, పాలకవర్గ సభ్యులు, రైతులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.