Site icon MANATELANGANAA

నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడంటే …

delimitation

హైదరాబాద్/అమరావతి, జూన్28, 2025: తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్ విభజనపై రాజకీయనేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది. సీట్ల పెంపు జరిగితే రాజకీయ ప్రాతినిధ్య అవకాశాలు లభించినా కొత్ప్రతగా ఏర్పడే స్థానాలతోపాటు ఉన్న రిజర్వేషన్ల స్థానే మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) ప్రక్రియ 2026 జనాభా గణన తర్వాతే జరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సీట్ల సంఖ్య పెంపు జరగకపోవడానికి రాజ్యాంగ నిబంధనలు కారణమని, 2026 తర్వాత ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం వెల్లడిస్తోంది.


కేంద్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టులో వెల్లడించిన వివరాల ప్రకారం, రాజ్యాంగంలోని 84వ అధికరణం ప్రకారం 2026 జనాభా గణన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2000 వరకు, ఆ తర్వాత 2002లో 84వ సవరణ ద్వారా 2026 వరకు సీట్ల సంఖ్యలో మార్పులపై నిషేధం విధించారు. ఈ నిషేధం 2026లో ముగియనుంది, దీంతో జనాభా లెక్కల ఆధారంగా డిలిమిటేషన్ ప్రక్రియ 2026-27లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది

2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (సెక్షన్ 26) ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153 అసెంబ్లీ సీట్లకు పెంచాలని సూచించినప్పటికీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం 2026 వరకు సీట్ల సంఖ్యలో మార్పులు చేయడానికి వీలులేదు. ఈ నిబంధన కారణంగా విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సంఖ్యలో ఎటువంటి పెంపు జరగలేదు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2011 జనాభా లెక్కల ఆధారంగా డిలిమిటేషన్ జరిగినప్పటికీ, తెలుగు రాష్ట్రాలకు ఈ వెసులుబాటు కల్పించలేదు

2026 జనాభా గణన ఆధారంగా డిలిమిటేషన్ జరిగితే, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కి, తెలంగాణలో 119 నుంచి 153కి పెరిగే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది జనాభా పెరుగుదల మరియు రాజకీయ ప్రాతినిధ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించబడుతుంది. పార్లమెంట్ సీట్ల విషయంలో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా లోక్‌సభ సీట్లు 545 నుంచి 848 లేదా 888కి పెరిగే అవకాశం ఉందని, దీనిలో దక్షిణ భారత రాష్ట్రాల వాటా తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల జనాభా తక్కువగా ఉండటం వల్ల, ఉత్తర భారత రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశం ఉంది, దీనిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం, డిలిమిటేషన్ అనంతరం అసెంబ్లీ మరియు పార్లమెంట్ సీట్లలో 33 శాతం మహిళలకు కేటాయించనున్నారు. ఈ చట్టం 2026 జనాభా గణన తర్వాత అమలులోకి వస్తుంది, దీనివల్ల రాజకీయ ప్రాతినిధ్యంలో మహిళల వాటా పెరిగే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సీట్ల పెంపునకు సంబంధించి డాక్టర్ కె. పురుషోత్తమ్ రెడ్డి 2022లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో డిలిమిటేషన్ జరిగినప్పుడు తెలుగు రాష్ట్రాలను మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. ఈ కేసుపై 2025 ఏప్రిల్‌లో జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్, డిలిమిటేషన్ అనేది రాత్రికి రాత్రి చేపట్టే ప్రక్రియ కాదని, 2026 జనాభా గణన తర్వాతే ఈ ప్రక్రియ సాధ్యమని వాదించారు

రాజకీయ టెన్షన్…

సీట్ల పెంపు జరిగితే, రెండు రాష్ట్రాల్లోని అధికార, విపక్ష పార్టీలకు లాభం చేకూరే అవకాశం ఉంది. గతంలో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా నేతలను చేర్చుకున్న టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) మరియు టీడీపీ వంటి పార్టీలు సీట్ల పెంపుతో కొత్త నేతలకు అవకాశాలు కల్పించవచ్చు. అయితే, దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ వాటా 24% నుంచి 19%కి తగ్గే ప్రమాదం ఉందని, దీన్ని అడ్డుకోవడానికి తెలంగాణ మౌనంగా ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

మహిళా రిజర్వేషన్

Share this post
Exit mobile version