Site icon MANATELANGANAA

బండి భగీరథ్ కేసు పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

బండి భగీరథ్ కేసు పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
తక్షణమే విచారణ మొదలు పెట్టాలని ఆదేశం
స్పెషల్ టీమ్ లు ఏర్పాటు చేయండి
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ్ పైన నమోదు కేసుపైన తక్షణమే విచారణ మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ను ఆదేశించారు.

8 వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ ని ముఖ్యమంత్రి ప్రశ్నించారు..

కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు.

ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని ముఖ్యమంత్రి కి డీజీపీ వివరించారు.

కేసు స‌మ‌గ్ర‌ విచారణ కోసం ప్రత్యేక టీం లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీ ని ఆదేశించారు..

Share this post
Exit mobile version