Site icon MANATELANGANAA

నిర్మల్ జిల్లా గ్రామీణ మండల తహశీల్దార్ కార్యాలయంలో మండల సర్వేయర్‌గా పనిచేస్తున్న ఎన్. బాలకృష్ణవర్మను, అతని సహాయకుడు పి. నాగరాజును లంచం పుచ్చుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.

ఫిర్యాదుదారుడి బంధువుకు చెందిన భూమికి హద్దులు నిర్ణయించి పంచనామా అప్పగించేందుకు ముందుగా రూ.15,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు.

ఫిర్యాదు దారుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా వారి సూచనలతో మిగతా డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు. మొదటి దఫా రూ.5,000 తీసుకున్న సర్వేయర్ మిగిలిన మొత్తంలో నుంచి రూ.7,500ను తన ప్రైవేట్ సహాయకుడు పోల నాగరాజు ద్వారా తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కారు.

Share this post
Exit mobile version