Site icon MANATELANGANAA

అ ద్విచక్ర వాహనంపై 233 పెండింగ్ చలాన్లు జరిమానా రూ.45,350

ద్విచక్ర వాహనాల పెండింగ్ చలాన్ల పై ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టారు. తనిఖీల్లో భాగంగా ఓ ద్విచక్ర వాహనదారు వాహనం పై 233 చాలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ వెంకన్న తన సిబ్బందితో కలసి కాజీపేట చౌరస్తాలో వాహన తనిఖీలు చేసే సమయంలో హన్మకొండ ప్రాంతానికి చెందిన అస్లం అనే వ్యక్తి వాహనానికి సంబందించి పెండింగ్ చలాన్లు వెలుగు చూసాయి.  ఏకంగా 233 ట్రాఫిక్ చలాన్లను  పెండింగ్ లో ఉన్నాయని ఈ చలాన్లు మొత్తం రూ 45,350 కావడంతో జరిమానా మొత్తం చెల్లించే వరకు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ వెంకన్న తెలిపారు.

Share this post
Exit mobile version