లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.



రాష్ట్రంలో భారీ వర్షాలు -ముందస్తు హెచ్చరికలు 

  రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరద ముప్పు పరిస్థితులపై ఈరోజు ఉదయం నుంచి జిల్లా కలెక్టర్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో సమీక్షిస్తున్న రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి


* ఖమ్మం. కొత్తగూడెం. వరంగల్. సూర్యాపేట. నల్గొండ. హైదరాబాద్ తదితర జిల్లాలో నెలకొన్న పరిస్థితుల ను అధికారులు ను అడిగి తెలుసుకున్నారు. 


* ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా  ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని  జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు.


* వరద ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మారం చేయాలని ఆదేశించారు. 


* లోతట్టు ప్రాంతాల ప్రజలను       సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.

* అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి.


 *   రెస్కూటీమ్‌లు,  ఎన్డీఆర్‌ఎఫ్‌. బృందాలు, అవసరమైతే రక్షణ చర్యలకు హెలికాప్టర్లు వినియోగించాలని  ఆదేశించారు.


    *విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు సిబ్బంది 24 గంటల పాటు సచివాలయంలో అందుబాటులో ఉండాలి. 


*విద్యుత్, తాగునీటికి, రాకపోకలకు అంతరాయాలు కలుగుకుండా చూసుకోవాలన్నారు.


*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నెలకొన్న పరిస్థితులపై ఆ జిల్లా కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.

* తక్షణమే అక్కడ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు

* ఎలాంటి ప్రాణా నష్ట ఆస్తి నష్టం చేరకుండా తక్షణం చర్యలు తీసుకోవాలి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు