జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 


రవీంద్రభారతి లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల స్వాధీన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది.

రవీంద్రభారతిలో జే.ఎన్. జే. హెచ్.ఎస్ కు భూమి స్వాధీన పత్రాలను అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని.

పేట్ భషీర్ బాద్లో  జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్స్ హౌ జింగ్ కో ఆపరేటివ్ సొసైటీ కి కేటాయించిన 38 ఎకరాల స్థలాన్ని ఈ కార్యక్రమం లో అప్పగిస్తూ కేటాయింపు ఉత్తర్వులు అందచేశారు.

ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లని గొప్పగా అభివర్ణించారు. జర్నలిస్టుల సంక్షేమం కోరుతూ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆనాడు వైఎస్ఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి శశబిషలు లేవని అన్నివిధాలా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు.

సుధీర్ఘ కాలం జర్నలిస్టుల సమస్యకు  ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తుందని అన్నారు.

జర్నలిస్టుల వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరని అది మనకు మనమే పెంచుకోవాలని అన్నారు.

ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు.

వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే మా ప్రభుత్వ విధాన మంటూ జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే అన్నారు.

ఆనాడు రాజాకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకున్నాయన్నారు.

కానీ ఈరోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయని విచారం వ్యక్తం చేసారు.

కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోందన్నారు.

కొంతమంది జర్నలిస్టు అనే పదం అర్ధాన్నే మార్చేస్తున్నారని అన్నారు.

అలాంటి వారిని నియంత్రించే బాధ్యత జర్నలిస్టుల పైనే ఉందన్నారు.

నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదన్నారు.

భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయని అన్నారు.

ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారన్నారు.

కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే వారు ప్రాధాన్యతనిస్తున్నారని విమర్శించారు.

అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దన్నారు.

నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు.

ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని అన్నారు.

వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత తాను తీసుకుంటా నని అన్నారు.

తెలంగాణకు టూరిజం, ఎనర్జీ, స్పోర్ట్స్ పాలసీలు లేవni

గత పదేళ్లుగా తెలంగాణకు అసలు పాలసీలే లేవని గత పాలకుల వైఫల్యాలను దుయ్య బట్టారు.

మేం మీలో ఒకరమే... మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాదే అన్నారు.

మీడియా అకాడమీకి  స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.10కోట్లు ఇస్తున్నామని ప్రకటించారు.

ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దni

అందరికి ఇస్తామని అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తామని హామీ ఇచ్చారు.

ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మనందరం భాగస్వాములమవుదామని ముఖ్యమంత్రి పిలుపు నిచ్చారు.

 మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,  మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు