సైబర్‌ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే వారియర్ల ప్రధాన కర్తవ్యం - పోలీస్ కమీషనర్



                                     వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా



 సైబర్‌ నేరగాళ్ల చేతుల్లో ప్రజలు మోసపోకుండా వారిలో సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించడమే సైబర్‌ వారియర్ల ప్రధాన కర్తవ్యమని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ర ఝా అన్నారు.

 వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రేట్‌ సైబర్‌ క్రైమ్స్‌ విబాగం అధ్వర్యంలో కమిషనరేట్‌కు చెందిన సైబర్‌వారియర్లతో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సోమవారం  ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

  సైబర్‌ క్రైమ్స్‌ విభాగం అధికారులు, వివిధ పోలీస్‌ స్టేషన్లకు చెందిన సైబర్‌ వారియర్లు పాల్గోన ఈ సమావేశంలో  ముందుగా పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్ల వారిగా నమోదయిన సైబర్‌ నేరాలపై సమీక్షించారు.   సైబర్‌ నేరాల నియంత్రణకై సైబర్‌ వారియర్లు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ  బాధితుల సొమ్మును దోచుకొన్న సందర్భాలలో  బాధితుల ఫిర్యాదుతో సైబర్‌ నేరస్థుడికి సంబంధించి బ్యాంక్‌ ఖాతాలను నిలిపేసిన కేసుల్లో తక్షణమే కేసులు నమోదు చేయాల్సి వుంటుందని అన్నారు.సైబర్‌ నేరాల్లోని నేరస్తులకు సంబంధించిన పి.టి వారేంట్లను పరిష్కరించడంతో పాటు,నిలిపివేసిన  నైబర్‌ నేరగాళ్ళ బ్యాంక్‌ ఖాతాలోని డబ్బు తిరిగి బాధితులకు అందేవిధంగా అధికారులు ప్రభుత్వం సూచించిన ఎస్‌.ఓ.పిని అనుసరిస్తూ భాధితులకు సత్వరమే న్యాయం అందించాలని స్టేషన్‌ అధికారులకు సూచించారు.  ప్రధానంగా ప్రజలు సైబర్‌ నేరాలకు గురవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సైబర్‌ నేరాలు జరిగే తీరుతెన్నులపై ప్రజలతో పాటు విధ్యార్థులు, యువతకు తెలియజేప్పే విధంగా సైబర్‌ వారియర్లు ముమ్మరంగా అవగహన కార్యక్రమాలు చేపట్టాలనన్నారు.

 అలాగే పెండింగ్‌ కేసులను పరిష్కరించే దిశగా స్టేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు.


ఈ కార్యక్రమములో అదనపు డిసిపి రవి, సైబర్‌ క్రైమ్స్‌ విభాగం ఏసిపి విజయ్‌కుమార్‌, వర్టికల్స్‌ ఇన్‌చార్జ్‌ ఏసిపి జనార్థన్‌ రెడ్డి, సైబర్‌ క్రైమ్స్‌ ఇన్స్‌ స్పెక్టర్‌ రవి, ఎస్‌.ఐలు చరణ్‌,శివతో ఇతర సిబ్బంది పాల్గోన్నారు. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు