ములుగులో మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క

 


గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా  ఎదగాలి :: రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.

త్వరలోనే మహిళలకు మీసేవ, పౌల్ట్రీ, డైరీ వ్యాపారాలు ఏర్పాటుకు ప్రోత్సాహం అందించనున్నా  ప్రభుత్వం. 

ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో  ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి. 

***

గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.


మంగళవారం ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో  ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు పొరిక బలరాం నాయక్,  జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. లతో కలిసి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. 



ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ములుగు జిల్లాలో కలెక్టరేట్, ఏరియ ఆసుపత్రి, ఐటిడిఏ, రామప్ప 

దేవాలయం  ఆవరణం లలో 

మొత్తం నాలుగు  ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు  ఏర్పాటు చేయనున్నామని అందులో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లాలో మొదటి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించామని పేర్కోన్నారు.


రాష్ట్రం లో ఉన్నా మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ సంవత్సరం 20 వేల కోట్ల రూపాయలు రుణాలు బ్యాంక్ లీకేజీ ద్వారా అందించడం జరుగుతుందని, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ప్రారంభించడం జరుగుతుందని నూతనమైన  ఆహార పదార్ధాలతో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే మహిళలు మి సేవ కేంద్రాలు , ఈవెంట్ మేనేజ్మెంట్, డైరీ ఫాంలు  , సోలార్ లైట్స్ , అదేవిధంగా 60 లక్షల పాఠశాల ఏక రూప దుస్తులను మహిళా సంఘాల ద్వారా కుట్టించామని పేర్కొన్నారు.



మహిళా శక్తి క్యాంటీన్ లలో ఆహారం అమ్మ చేతి వంటల ఉండాలని , నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. మహిళా శక్తి క్యాంటీన్లు దేశానికే ఒక బ్రాండ్ గా నిలవాలని , స్థానిక వనరులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మహిళా శక్తి బిజినెస్ మోడల్స్  ను త్వరలోనే రూపొందిస్తామని , రానున్న ఐదు సంవత్సరాలలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందించడంతో పాటు మీసేవ, పౌల్ట్రీ, డైరీ వ్యాపారాలు, క్యాంటీన్ల ఏర్పాటు కు అన్ని రకాల ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందించడంతోపాటు

వడ్డీ లేని రుణ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.



ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి. శ్రీజ, మహేందర్ జి, డి ఆర్ డి ఓ శ్రీనివాస్ కుమార్, జిల్లా అధికారులు, ప్రియదర్శిని మహిళా పొదుపు సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు