కెయూ పోలీస్ స్టేషన్‌కు కంప్యూటర్లు ప్రింటర్లు అంద జేసిన కిట్స్ యాజమాన్యం

                                               



కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ వరంగల్  (కిట్స్‌డబ్ల్యు) యాజమాన్యం  సంస్థాగత సామాజిక బాధ్యత కింద కెయూ పోలీస్ స్టేషన్‌కు నాలుగు కంప్యూటర్లు మరియు రెండు ప్రింటర్లను విరాళంగా అంద జేసింది.

రాజ్య సభ మాజి సబ్యులు, మాజి మంత్రి  యమ్. పి.& కిట్స్‌డబ్ల్యు  చైర్మన్,  కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు మరియు కోశాధికారి, . పి. నారాయణ రెడ్డి సంస్థాగత సామాజిక బాధ్యత కింద హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం (కెయూ) పోలీస్ స్టేషన్‌కు హేవీ డ్యూటి తో కూడిన నాలుగు కంప్యూటర్ సిస్టమ్‌లు మరియు రెండు ప్రింటర్‌లను విరాళంగా ఇచ్చారు.  వీటిని స్వయంగా కిట్స్  యాజమాన్యం  ప్రముఖులు పోలీస్ స్టేషన్‌, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. సంజీవ్‌కి అందజేశారు.

కెయూ పోలీస్ స్టేషన్‌, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, బి. సంజీవ్  కిట్స్ వరంగల్ యాజమాన్యానికి  కృతజ్ఞతలు తెలియజేసారు. 

 కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్, ప్రో. కె అశోక రెడ్డి చొరవ చూపినందుకు మరియు విద్యార్థులతో పాటు సమాజం కోసం వారి సేవలు ఇలా ఉపయోగపడినందుకు ను మార్పిడి చేసినందుకు సంతోషం వ్యక్తం చేసారు.


ఈ కార్యక్రమంలో కిట్స్‌డబ్ల్యు యాజమాన్యం సభ్యులు,  కోశాధికారి .పి నారాయణ రెడ్డి గారు, ప్రిన్సిపాల్ సర్, ప్రొఫెసర్ కె అశోక రెడ్డి, , కెయూ పోలీస్ స్టేషన్‌, సబ్ ఇన్స్పెక్టర్, పి రాజ్ కుమార్, రిజిస్ట్రార్, ప్రొఫెసర్ యమ్. కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రొఫెసర్. పి.రమేష్ రెడ్డి, ఫిజికల్ సైన్సెస్ విభాగాధిపతి & ప్రజా సంబంధాల అధికారి, డా. డి. ప్రభాకరా చారి, తదితరులు పాల్గొన్నారు.

---



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు