విభజన సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీలు - ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలో కీలక నిర్ణయం

 


రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విభజన సమస్యలకు సంభందించి ఉన్నతస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మఖ్యమంత్రుుల చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ల సమావేశం ముగిసిన అనంతరం డిప్యూటి సిఎం మల్లు విక్రమార్క భట్టి తో పాటు మంత్రుుల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అంధ్ర ప్రదేశ్ మంత్రులు సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేశ్ . సంయుక్తంగా  మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఎకాఎకిన ఉన్నఫలంగా సమస్యలు పరిష్కారం అవుతాయని భావించ లేదని అయితే పరిష్కారం దిశగా తొలి ప్రయత్నం జరిగిందని  అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ద్వారా గత 10 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని అంశాలను త్వరగా చర్చించుకుని ముందుకు పోవాలని నిర్ణయించి నట్లు  తెలిపారు.

విభజన చట్టంలోని సమస్యలన్నిటికీ మొదటి సమావేశంలోనే పరిష్కారం దొరుకుతుందని మేము భావించలేదని తెలిపారు 

సమస్యల పరిష్కారానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, రెండు రాష్ట్రాల ప్రతినిధులు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చా మన్నారు.

సమస్యల పరిష్కారానికి మూడు దశల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

చీఫ్ సెక్రెటరీ స్థాయి ఉన్నతాధికారులతో కూడిన ఇరు రాష్ట్రాల నుంచి త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.


రెండు వారాల్లో ఉన్నత స్థాయి అధికారుల కమిటీ సమావేశమై వారి స్థాయిలో పరిష్కార మార్గాలు చూస్తారన్నారు.


ఉన్నత స్థాయి అధికారులు పరిష్కారం చూపలేని అంశాలపై ఇ రు రాష్ట్రాల మంత్రుల కమిటీలు కసరత్తు చేసి  మార్గాలు కనుగొంటాయాని అన్నారు.


మంత్రుల స్థాయిలో పరిష్కారం కనుగొన్న సమస్యలకు ముఖ్యమంత్రి ల ఆమోదం ోసం ముందుచుతారన్నారు.  

ఇరు రాష్ట్రాల మంత్రుల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిష్కార మార్గాలు కనుగొనాలని ప్రాథమికంగా నిర్ణయించామని తెలిపారు.

వీటితోపాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యల పై కలిసి పనిచేయాలని నిర్ణయించామని తెలిపారు. 

యాంటీ నార్కోటిక్ అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అడిషనల్ డీజీ స్థాయి అధికారితో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుందని తెలిపారు. 

సైబర్ క్రైమ్ కు  సంబంధించి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ఈ రెండు అంశాల్లో రెండు రాష్ట్రాలు సమన్వయంతో పని చేయాలని వీటిని నియంత్రించాలని నిర్ణయించినట్లు తెలిపారు.


ఈ మహమ్మారుల నుంచి రెండు రాష్ట్రాల ప్రజలను కాపాడుకునేందుకు.. అడిషనల్ డీజీ స్థాయిలో రెండు రాష్ట్రాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకొని.. సమన్వయంతో పని చేసుకుని వీటిని నియంత్రించాలని నిర్ణయించినట్లు వివరించారు.


తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు


* గత పదేళ్ళలో పరిష్కారం కాని అంశాలపై సుదీర్ఘంగా చర్చ..

* ఉన్నతస్థాయి అధికారులతో త్రీమెన్ కమిటీ వేయాలని నిర్ణయం.. రెండు వారాల్లో కమిటీ ఏర్పాటు..

* అధికారుల స్థాయిలో పరిష్కారం కానీ అంశాలకు మంత్రుల స్థాయిలో కమిటీ..

* మంత్రుల స్థాయిలో పరిష్కారం కానీ అంశాలపై మరోసారి సీఎంల స్థాయిలో భేటి కావాలని నిర్ణయం..

* యాంటి నార్కోటిక్ , సైబర్ క్రైం నియంత్రణ కోసం కలిసి పని చేయనున్న  రెండు రాష్ట్ర ప్రభుత్వాలు..


తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంత్రులు అనగాని సత్య ప్రసాద్, జనార్దన్ రెడ్డి, దుర్గేష్.. తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్ గారు ఈరోజు జరిగిన సమావేశం యొక్క నిర్ణయాలను ఉమ్మడిగా తెలియజేయడం కోసమే మీ ముందు కూర్చున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కొద్దిమంది మంత్రులు అయిన మేము లోతుగా చర్చించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలను, సమస్యలను త్వరితగతిన చర్చించుకోవాలని, పరిష్కరించాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఒక్క సమావేశంలోనే పరిష్కారం వస్తుందని మేము అనుకోలేదు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఎస్ లతో పాటు ముగ్గురు అధికారులతో కమిటీ ఉంటుంది. రెండు వారాల్లో సమావేశం కావాలని నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ అధికారుల కమిటీలో పరిష్కారం కానీ అంశాల కోసం మంత్రుల కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కూడా వీలుకాకపోతే ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబర్ క్రైమ్ నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈమేరకు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేయాలని నిర్ణయించారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ఈరోజు తెలుగు జాతి హర్షించే రోజు. విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు చంద్రబాబు లేఖ పంపించారు. ఈరోజు జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అందరి సలహాలు తీసుకుని కూలంకషంగా చర్చించాం. పెద్ద ఎత్తున ఉద్యమం తర్వాత తెలంగాణ ఏర్పడింది. అందరికీ మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా మళ్లీ సమావేశమై చర్చించాలని ఇద్దరు సీఎంలు చెప్పారు. ఏపీలో ఇప్పటికే డ్రగ్స్ పై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం. డ్రగ్స్ మహమ్మారి సమస్యలను ఇరు రాష్ట్రాల అడిషనల్ డీజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు.


---ఎండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు