ప్రభుత్వాన్ని పడగొడుతా మంటే నిలబెడుతామని కాంగ్రెస్ లో చేరుతున్నారు -సీఎం రేవంత్ రెడ్డి

 


కాంగ్రెస్ పార్టీ లో బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల చేరిక పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖలు



అబ్దుల్లాపూర్ మెట్ లో ఆదివారం జరిగిన "కాటమయ్య రక్షణ కవచం”  పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల చేరికల పై కీలక వ్యాఖ్యలు చేసారు.

బి ఆర్ ఎస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు మా ప్రభుత్వాన్ని కూలుస్తా మంటే ఎమ్మెల్యేలు నిలబెడుతామని వస్తున్నారని అన్నారు.

తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు మద్దతుగా బీఆరెస్ ఎమ్మెల్యేలు వస్తున్నారని అన్నారు.


కాంగ్రెస్ పని అయిపోయింది అన్నవాళ్లు.. ఇప్పుడు వాళ్ల వైపు ఎంతమంది ఉన్నారని లెక్కపెట్టుకునే పరిస్థితి ఉందన్నారు.


పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ముఖ్య మంత్రి స్పష్టం చేసారు.

ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని గౌడన్నలు ఎంతో ప్రచారం చేశారన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బలహీనవర్గాల గౌరవం పెరుగుతుందని గౌడన్నలు ప్రచారం చేశారని పౌరుషానికి, పోరాటానికి మారుపేరు గౌడన్నలని అన్నారు.

కులవృత్తులకు చేయూత అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఎవరెస్టు ఎక్కిన వారి అనుభవం గౌడన్నల రక్షణకు ఉపయోగపడిందన్నారు.

వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు.

బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేస్తోందని వైఎస్ఆర్ హయాంలో బలహీన వర్గాల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్ తీసుకొచ్చారని గుర్తు చేసారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ ను ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు చేపట్టేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.

రాష్ట్రంలో వనమహోత్సవంలో భాగంగా తాటి, ఈత చెట్ల పెంపకం చేపట్టాలని మంత్రి జూపల్లికి సూచించారు.

చెరువు గట్లపై కూడా చెట్లు నాటా లని ఇరిగేషన్ విభాగంతో మాట్లాడాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచించారు.

రహదారులు, చెరువుగట్లు, కాలువగట్ల వద్ద తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు తీసుకుంటా మన్నారు.

గౌడన్నల కులవృత్తిని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

కులవృత్తులపై ఆధారపడిన సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా....

మీ పిల్లలను ఉన్నత చదువులు చదివించండి.. వాళ్లను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దండి.

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారు భాగస్వాములు కావాలి అని ముఖ్య మంత్రి అన్నారు.

చట్టాలు  రూపొందించే స్థాయికి మీ పిల్లలు ఎదగాలని అన్నారు.

బలహీన వర్గాలు పాలకులుగా మారాలంటే  ఏకైక మార్గం చదువు మాత్రమే అన్నారు.

త్వరలోనే హయత్ నగర్ కు మెట్రో రాబోతుందని

ఇందుకు సంబంధించి అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయని ఫార్మా కంపెనీల కోసం సేకరించిన భూమిలో వివిధ యూనివర్సిటీలను, మెడికల్ టూరిజం,  పరిశ్రమల  ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.

న్యూయార్క్ నగరంతో పోటీ పడేలా మహేశ్వరంలో ఒక అద్భుతమైన నగరం నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

ఊటీ కంటే అద్భుతమైన రాచకొండ ప్రాంతాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి అణువుగా మార్చబోతున్నామని తెలిపారు.

రంగారెడ్డి జిల్లాకు మహర్దశ రాబోతోందని

ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను తీర్చిదిద్దుతామని అన్నారు.

ఓడిపోయి ఫామ్ హౌస్ లో ఉన్నోళ్లను నేను అడుగుతున్నా...

ఔటర్ రింగ్ రోడ్, ఫార్మా ఇండస్ట్రీ, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ తెచ్చింది కాంగ్రెస్ కాదా?

మీరేం తెచ్చారు... డ్రగ్స్, గంజాయి తప్ప..అంటూ బి ఆర్ ఎస్ పార్టీ నేత ల పై విమర్శలు చేసారు.


----

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు