చంద్రబాబు నాయుడు - రేవంత్ రెడ్డి గురు శిష్యులు కాదు సహచరులు



గురుశిష్యులనే వారివి అవగాహన రాహిత్య మైన మాటలు

           డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క మల్లు

ఏపి సిఎం చనారా చంద్రబాబు నాయుడు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఇద్దరి గురించి ట్రోలింగ్ నడుస్తోంది. అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో వారిద్దరి భందాన్ని గురుశిష్యుల భందంగా పేర్కంటూ వార్తలు మరో వైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడ నడుస్తోంది.  వారి  భందం గురించి  తెలంగాణ డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టత ఇచ్చారు.


ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదని... వారు సహచరులేనని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ఏపీ సీఎంగా, రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఉన్నారన్నారు. వారిద్దరి మధ్య గురుశిష్యుల సంబంధం ఉందని చెప్పేవారివి అవగాహన లేని మాటలని కొట్టి పారేసారు.


ఆరు గ్యారెంటీలు అమలు చేశాం


అనుకున్న సమయం కంటే ముందే తాము ఆరు గ్యారెంటీలను అమలు చేశామని భట్టివిక్రమార్క అన్నారు. త్వరలో రైతు రుణమాఫీ చేసి హామీని నిలబెట్టుకుంటామన్నారు. ఒక లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ ఐదేళ్లు అయినా హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. కానీ ఇప్పుడు మాత్రం రుణమాఫీ ఎప్పుడు చేస్తారని తమను అడగడం విడ్డూరంగా ఉందన్నారు.

ALSO READ: ప్రజా భవన్ లో  చర్చలకు ఏర్పాట్లు సిద్దం

రైతుబంధును తాము రైతుభరోసాగా మార్చినట్లు చెప్పారు. రైతు భరోసాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీలో తమ సొంత నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు. ప్రజలు కట్టిన పన్నులతోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు కట్టిన ప్రతి పైసా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలన్నారు. సంపదను సృష్టించి ప్రజలకు పంచాలనేదే తమ ఆలోచన అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు