శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి

 


మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ (39) బుధవారం చని పోయారు. హైదరాబాద్ గచ్చి బౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

 శిరీష్ భరద్వాజ్, శ్రీజ ఇద్దరూ  2007లో ప్రేమించికుని   ఆర్యసమాజ్ లో వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని వుందని చిరంజీవి కుమార్తె సంచలన ఆరోపణ చేశారు. పవన్ కళ్యాన్ పై కూడ ఆరోపణలు చేశారు.  శ్రీజ- భరద్వాజ్ దంపతులకు ఒక కుమార్తె కూడా వుంది. 

మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఇద్దరూ  ఆతర్వాత  2014 విడాకులు తీసుకున్నారు. 2012 లో తననను మానసికంగా శారీరకంగా భరద్వాజ్ వేధిస్తున్నాడని పోలీసులకు శ్రీజ ఫిర్యాదు చేశారు. విడాకుల అనంతరం కల్యాణ్ దేవ్ ను శ్రీజ రెండో వివాహం చేసుకున్నారు.   కల్యాణ్ దేవ్ కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. ఇదిలా వుండగా భరద్వాజ్ కూడా 2019లో హైదరాబాద్ కు చెందిన   డాక్టర్ విహనను పెళ్లి చేసుకున్నారు. బీజేపీలో చేరిన భరద్వాజ్ కొంత కాలం రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత భార్యతో కలిసి చెన్నైలో స్థిరపడ్డారు.

భరద్వాజ్, శ్రీజ ఆస్తులపై కన్నేసి ఆమెను ప్రేమలో పడేసాడని ఆరోపణలు వచ్చాయి.  భరద్వాజ నిజస్వరూపం పెండ్లి తర్వాత తెల్సిందని  శ్రీజ ఆరోపించారు. శ్రీజ పేరిట చిరంజీవి కోట్లాది రూపాయల ఆస్తులు రిజిస్టర్ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. 

భరద్వాజ్ కొంత కాలంగా  ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్టు కుటుంబ సబ్యులు తెలిపారు.  ఇటీవల అనారోగ్య సమస్య తీవ్రం కావడంతో ఆస్పత్రిలో చేరారు. అయినప్పటికీ ఆయన కోలుకోలేక పోయారు. మృత్యువుతో పోరాటంలో ఆయన ఓడిపోయారు. గుండె పోటుతో శిరీష్ భరద్వాజ్ తుదిశ్వాస విడిచినట్టు అతని స్నేహితులు తెలిపారు. ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగి పోయింది.

శిరీష్ భరద్వాజ్ మృతి చెందిన వార్త శ్రీరెడ్డి ఎక్స్ లో  ట్వీట్ చేసారు.  "శిరీష్ భరద్వాజ్ (చిరంజీవి మాజీ అల్లుడు) ఇక లేరు. ఇప్పటికైనా నీకు శాంతి దొరికిందిరా శిరీష్. అందరూ నిన్ను మోసం చేశారు" అంటూ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు