కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కల్సిన మంత్రి సీతక్క

 పెండింగ్ పనులుక్లియర్ చేయాలనీ విజ్ఞప్తి 


*కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అయిన పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి , మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ ధ‌న‌స‌రి అనసూయ సీత‌క్క‌*


* తెలంగాణలో పెండింగ్ పనులను వెంటనే క్లియర్ చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరిన సీతక్క

* వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో  ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్డు నిర్మించాలని కోరిన సీతక్క

* PMGSY లో కనెక్టివిటీ లేని  1270 ఆవాసాలకు సంబంధించి కేంద్రానికి అన్ని వివరాలు తెలిపిన సీతక్క

* రోడ్డు మార్గం లేని 164కు పైగా ఆదివాసి గిరిజన గూడాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరిన సీతక్క

* అన్ని మారుమూల ఆవాసాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన సీతక్క

* ఆదివాసి ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అటవీ శాఖ అనుమతులు ఇచ్చేలా చొరవ చూపాలని విజ్ఞప్తి 

* ఆదివాసి ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాల రోడ్డు నిర్మాణం కోసం తక్షణ నిధులు మంజూరు చేయాలని కోరిన సీతక్క

* సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ 

* నిధులు మంజూరు చేసి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన శివరాజ్ సింగ్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు