అధునాత‌న సాంకేతిక కేంద్రాలుగా ఐటీఐలు - మ‌ల్లేప‌ల్లి ఐటీఐలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌


 అధునాత‌న సాంకేతిక కేంద్రాలుగా ఐటీఐలు

* రూ.2,324.21 కోట్ల‌తో ఐటీఐల ఆధునీక‌ర‌ణ‌
* మంగళవారం మ‌ల్లేప‌ల్లి ఐటీఐలో ఏటీసీల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌

హైద‌రాబాద్, జూన్ 17:  ఆధునిక ప‌రిశ్ర‌మ‌ల (ఇండ‌స్ట్రీ 4.0) అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా యువ‌త‌ను తీర్చిదిద్దేందుకుగానూ ఐటీఐల‌ను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఏటీసీ) మార్చాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందుకోసం ఐటీఐల‌ను ఏటీసీలుగా తీర్చిదిద్దాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని 65 ఐటీఐల‌ను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసేందుకురాష్ట్ర ప్ర‌భుత్వం టాటా టెక్నాల‌జీస్ లిమిటెడ్ (టీటీఎల్‌)తో ప‌దేళ్ల‌కుగానూ అవ‌గాహ‌న ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.  ఏటీసీల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం గంట‌ల‌కు మ‌ల్లేప‌ల్లి ఐటీఐలో శంకుస్థాప‌న చేసారు. ఐటీసీల‌కు సంబంధించిన ముఖ్య అంశాలు..

* 65 ఐటీఐల‌ను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేస్తారు.
* ఆధునిక ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఏటీసీల్లో యువ‌త‌కు శిక్ష‌ణ ఇస్తారు. ఇందుకోసం ఏటీసీల్లో అధునాత‌న సామ‌గ్రి, సాంకేతిక‌త ఏర్పాటు చేస్తారు.
* శిక్ష‌ణ ఇచ్చేందుకు 130 మంది  నిపుణుల‌ను టీటీఎల్ నియ‌మిస్తుంది.
* ఏటీసీల్లో ఏటా 15,860 మందికి ఆరు ర‌కాల దీర్ఘ కాల (లాంగ్ ట‌ర్మ్‌) కోర్సుల్లో, 31,200 మందికి 23 ర‌కాల స్వ‌ల్ప కాలిక (షార్ట్ ట‌ర్మ్‌) కోర్సుల్లో శిక్ష‌ణ అందిస్తారు.
* గ‌త  ప‌దేళ్ల‌లో రాష్ట్రంలోని ఐటీఐల్లో కేవ‌లం 1.5 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే శిక్ష‌ణ పొందారు. ఈ ఏటీసీల‌తో రానున్న ప‌దేళ్ల‌లో నాలుగు ల‌క్ష‌ల మంది శిక్ష‌ణ పొందుతారు.
* ఐటీఐల‌ను ఏటీసీలుగా మార్చే ప్రాజెక్టు మొత్తం వ్య‌యం రూ.2,324.21 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్ర‌భుత్వం వాటా రూ.307.96 కోట్లు (13.26 శాతం) కాగా టీటీఎల్ వాటా రూ.2016.25 కోట్లు (86.74)
* ఏటీసీలు కేవలం వివిధ కోర్సుల్లో శిక్ష‌ణకే ప‌రిమితం కాకుండా  నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా ప‌ని చేస్తాయి.  అలాగే ఈ ఏటీసీలు  ఔత్సాహిక పారిశ్రామికవేత్త‌లతో పాటు చిన్న‌, సూక్ష్మ‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, భారీ ప‌రిశ్ర‌మ‌ల‌కు సాంకేతిక కేంద్రాలుగానూ (టెక్నాల‌జీ హ‌బ్‌) ప‌ని చేస్తాయి.
* ఏటీసీల్లో వివిధ కోర్సుల్లో శిక్ష‌ణ పొందిన వారికి టీటీఎల్ ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంది.
* ఏటీసీలు భ‌విష్య‌త్తులో త‌మ సేవ‌ల‌ను పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు అంద‌జేస్తాయి.


మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ అప్ గ్రేడేషన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర  సాధనలో నిరుద్యోగ సమస్య అత్యంత కీలక పాత్ర పోషించిందన్నారు.



నిరుద్యోగులకు ఉపాధి,ఉద్యోగఅవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం... 
రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐ లు నిరుపయోగం మారాయి.. 
ఐటీఐ ల్లో నేర్పించే నైపుణ్యాలు విద్యార్థులకు ఉపయోగం లేకుండా పోయాయి...

40, 50 ఏళ్ల కిందటి నైపుణ్యాలను ఐటీఐ ల్లో నేర్పిస్తున్నారు.. 

విద్యార్థులు, నిరుద్యోగులను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను.. 

నా ఆలోచనల నుంచి వచ్చిందే ఏటీసీ సెంటర్స్.. 

మేం పాలకులు, మీరు బానిసలు అన్న ఆలోచన మాకు లేదు.. మేం సేవకులం ...

40 లక్షల మంది యువతీ యువకులు ఉపాధి లేక రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూ తిరుగుతున్నారు...

సర్టిఫికెట్ ఉంటే సరిపోదు సాంకేతిక  నైపుణ్యం ఉండాలి... 

సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉపాధి లభిస్తుందని నేను నమ్ముతున్న...

కేవలం సర్టిఫికెట్స్  జీవన ప్రమాణాలను పెంచవు.. 

దుబాయ్ లాంటి దేశాలకు వలసలు వెళ్లకుండా ప్రభుత్వం ఉపాధి గ్యారెంటీ ఇస్తుంది... 

టాటా సంస్థ సహకారం తో సాంకేతిక నైపుణ్యాల కోసం 2324 కోట్లతో 65 ఐటీఐల ఐటీసీ లు గా మారుస్తున్నాం.. 

విద్యార్థుల శిక్షణ కోసం ముందుకు వచ్చిన టాటా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.. 

ఐటీ రంగంలో ప్రపంచం తో మన తెలుగు వారు పోటీ పడుతున్నారు..

మధ్య తరగతి, దిగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించడమే మా బాధ్యత.. 

రాష్ట్రం లోని 65 ఐటీఐ లను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దుతాం...

నైపుణ్యాలను నేర్పించడం ద్వారా నిరుద్యోగులకు భరోసా కల్పిస్తాం...

విద్యార్థిని విద్యార్థులు ఐటీఐ ల్లో చేరాలి... 

ఈ శాఖ నా దగ్గరే ఉంటుంది.. నేనే పర్యవేక్షిస్తా.. ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తా.. 

మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ అప్ గ్రేడేషన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్...

తెలంగాణ రాష్ట్ర  సాధనలో నిరుద్యోగ సమస్య అత్యంత కీలక పాత్ర పోషించింది...
నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగఅవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం... 
రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐ లు నిరుపయోగం మారాయి.. 
ఐటీఐ ల్లో నేర్పించే నైపుణ్యాలు విద్యార్థులకు ఉపయోగం లేకుండా పోయాయి...

40, 50 ఏళ్ల కిందటి నైపుణ్యాలను ఐటీఐ ల్లో నేర్పిస్తున్నారు.. 

విద్యార్థులు, నిరుద్యోగులను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను.. 

నా ఆలోచనల నుంచి వచ్చిందే ఏటీసీ సెంటర్స్.. 

మేం పాలకులు, మీరు బానిసలు అన్న ఆలోచన మాకు లేదు.. మేం సేవకులం ...

40 లక్షల మంది యువతీ యువకులు ఉపాధి లేక రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూ తిరుగుతున్నారు...

సర్టిఫికెట్ ఉంటే సరిపోదు సాంకేతిక  నైపుణ్యం ఉండాలి... 

సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉపాధి లభిస్తుందని నేను నమ్ముతున్న...

కేవలం సర్టిఫికెట్స్  జీవన ప్రమాణాలను పెంచవు.. 

దుబాయ్ లాంటి దేశాలకు వలసలు వెళ్లకుండా ప్రభుత్వం ఉపాధి గ్యారెంటీ ఇస్తుంది... 

టాటా సంస్థ సహకారం తో సాంకేతిక నైపుణ్యాల కోసం 2324 కోట్లతో 65 ఐటీఐల ఐటీసీ లు గా మారుస్తున్నాం.. 

విద్యార్థుల శిక్షణ కోసం ముందుకు వచ్చిన టాటా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.. 

ఐటీ రంగంలో ప్రపంచం తో మన తెలుగు వారు పోటీ పడుతున్నారు..

మధ్య తరగతి, దిగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించడమే మా బాధ్యత.. 

రాష్ట్రం లోని 65 ఐటీఐ లను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దుతాం...

నైపుణ్యాలను నేర్పించడం ద్వారా నిరుద్యోగులకు భరోసా కల్పిస్తాం...

విద్యార్థిని విద్యార్థులు ఐటీఐ ల్లో చేరాలి... 

ఈ శాఖ నా దగ్గరే ఉంటుంది.. నేనే పర్యవేక్షిస్తా.. ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తా అని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు