ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలి - వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి



 ఎపి మాజి సిఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆయన అభిప్రాయం పోస్టు చేశారు. 
అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్‌నే వాడుతున్నాయని జ‌గ‌న్‌ పేర్కొన్నారు.
మనం కూడా అదే దిశగా పయనించాలని అన్నారు.


ఈవిఎం లు బాన్ చేయాలని ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అభ్యంతరాలపై ఎపి మాజి సిఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కూడ స్పందించారు.

ఎన్నికల్లో ఊహించని విదంగా ఘోర పరాజయం పాలై ఇంటిపట్టునే మదన పడుతున్న ఓపి మాజి సిఎం జగన్ మోహన్ రెడ్డి  ఈవీఎంలపై విమర్శలకు తన గొంతు జత చేశారు.  వైఎస్ జగన్మోహ‌న్‌ రెడ్డి  ఎక్స్ వేదికగా పోస్టులో తన భావాలువ్యక్తం చేశారు. ఎప్పుడూ నేరుగా ఈవీఎంలను టార్గెట్ చేయని జగన్ రెడ్డి తాజాగా ఓటమి తర్వాత ఈవిఎంల వాడకంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.  ఈవీఎంలపై నమ్మకం సన్నగిల్లుతున్న వేళ పేపర్‌ బ్యాలెట్లు ఉప‌యోగించ‌డం మంచిద‌ని ఆయ‌న త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 

"న్యాయం జరగడం మాత్రమే కాదు, కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్ధతుల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి" అని జగన్ ట్వీట్ చేశారు. కాగా, ఈవీఎంలను హ్యాక్ చేయచ్చంటూ టెక్నాలజీ దిగ్గజం ఎలాన్ మస్క్ తాజాగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఈవీఎంలపై చర్చ జరుగుతున్న వేళ జగన్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు