హైదరాబాద్, జూన్ 21: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా.చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. వివిధ శాఖలకు చెందిన సమస్యలతో వచ్చిన ప్రజలు చిన్నారెడ్డిని, ప్రజాభవన్ అధికారులను కలిసి వినతిపత్రాలు అందచేశారు. శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 575 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 185, హౌసింగ్ కు సంబంధించి 64 దరఖాస్తులు, వినియోగ దారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల శాఖలకు సంబంధించి 50, పంచాయతి రాజ్, గ్రామిణాభివద్ది శాఖకు సంబంధించి 43, హోం శాఖకు సంబంధించి 42 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి 191 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్ శాఖ సంచాలకులు శ్రీమతి దివ్య, ఇతర అధికారులు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు స్వీకరించండం తో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box