భగవంతుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి

 


రామాలయ ఆలయ నిర్మాణం భూమి పూజలో సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ 

భగవంతుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి

రామాలయం భూమి పూజలో పాల్గొన్న సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ 


సర్వోన్నత ఆదర్శాలకు నిలువెత్తు రూపం శ్రీరాముడు


వెంకటాపూర్ : ఏకపత్నివతుడుగా, సద్గుణాలు కలిగిన శ్రీరామ చంద్రుడు సర్వోన్నత ఆదర్శాలకు నిలువెత్తు రూపమని సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ వ్యస్థాపకులు, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు,

మంగళవారం వెంకటాపూర్ మండలం అడవిరంగాపురం (నారాయణపూర్) గ్రామంలో శ్రీరాముడి దేవాలయానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తస్లీమా పాల్గొన్నారు, 

వేదమంత్రాలతో నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో తస్లీమా కొబ్బరికాయ కొట్టారు, 

అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్క నాటారు,

సర్వమతాల సారాంశం ఒక్కటేనని, అందరికీ అదర్శమూర్తి (శ్రీరాముడు) భగవంతుడి ఆశీస్సులు ప్రలందరిపై ఉండాలని తస్లీమా కోరుకున్నారు, 

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల వెంకటరణాఛార్యులు, ఆలయ కమిటీ ఛైర్మన్ బోల్నేని రామారావు, వైస్ చైర్మన్ తీగల వీరన్న, కమిటీ సభ్యులు అంగజాల రాజయ్య, వెంకటస్వామి,యుగంధర్, కుమార్, వెంకటరమణ, రాజేందర్ , రవీందర్, సంతోష్, శివయ్య,తిరుపతి, రఘు,ప్రశాంత్, సంపత్, లింగయ్య, శంకర్, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు,

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు