శ్రీ హనుమద్గిరి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం లో మంగళవారం రోజు ఉదయం ఆరు గంటలకు పంచామృత అభిషేకము చందన సేవ అర్చన అలంకరణ గోత్రం నామార్చన చేసి కరెన్సీ నోట్లతో హనుమంతుని అలంకరణ చేశారు. విదేశీ కరెన్సీ తో కూడా అలంకరించారు. ఆలయ అర్చకులు ఆరుట్ల రామాచారి ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్య క్రమాలు నిర్వహించి నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు భజన కార్యక్రమం నిర్వహించి తదుపరి అన్నదానము కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నదాన కమిటీ అధ్యక్షులు గందె కృష్ణ, ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల రవికుమార్, దశరథ్ కుమార్, మాదాసు మొగులయ్య, గండ్రతి సుధాకర్, సమ్మయ్య హనుమాన్ స్వాములు తదితరులు పాల్గొన్నారు
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box