కేంద్ర సాయుధబలగాల అధికారులను సత్కరించిన సిపి
పార్లమెంట్ ఎన్నికల పురస్కరించుకొని ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించి తిరిగి స్వస్థలాలకు తిరిగి వెళ్ళుతున్న కేంద్ర సాయుధ బలగాలకు చెందిన అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేసారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ స్థానిక పోలీసులతో పాటు కేంద్ర సాయుధబలగాలు సమన్వయం కల్సి పనిచేయడం ద్వారా ఎలాంటి సంఘటన జరగకుండా పూర్తిస్థాయిలో ప్రశాంతవంతమైన వాతవరణంలో ఎన్నికలు నిర్వహించబడ్డాయని. ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించడంలో బందోబస్తు విధులు నిర్వహించిన సిఆర్పిఎఫ్ అధికారులు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ అభినందించారు. పోలీస్ కమిషనర్ సత్కరించివారిలో శ్రీమతి సనతోదేవి, సోమ్జిత్ భగత్, శరత్నాథ్, సంజయ్కుమార్, అనీష్, రాంనారయణ బిస్వాస్, రాంకుమార్ సా,బాధు, రాంచంద్ర సింగ్ వున్నారు. ఈ కార్యక్రమములో స్పెషల్ ఎసిపి జితేందర్ రెడ్డి, ఇన్స్స్పెక్టర్, పుల్యాల కిషన్ పాల్గోన్నారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box