దమ్ముంటే లోక్ సభ ఎన్నికల్లో ఓక్క సీటైనా గెలిపించు- కెటిఆర్ కు రేవంత్ రెడ్డి బిగ్ ఛాలెంజ్

 చేవెళ్ల సభలో  రేవంత్ రెడ్డి 

కార్యకర్తల అండ ఉన్నంతకాలం నా కుర్చీని ఎవరూ టచ్ చేయలేరు

చేవెళ్లలో మంగళవారం జరిగిన 'జనజాతర' సభలో సిఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు పెద్ద సవాల్ విసిరారు.  దమ్ముంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ఓక్క సీటైనా గెలిపించి చాపాలన్నారు. "రేవంత్ పేరు చెబితే మూడు సీట్లు కూడా వచ్చేవి కావని కేటీఆర్ చెప్పారు. ఆయనకు చేవెళ్ల సభ నుంచి సవాల్ విసురుతున్నా... దమ్ముంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో భారాసకు ఒక్క సీటయినా గెలిపించి చూపించాలి. రేవంత్ రెడ్డి అంటే అల్లాటప్పా అనుకోవద్దు. తండ్రి పేరు చెప్పి పదవిలో కూర్చున్న వ్యక్తిని కాదు. కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగాను. చంచల్ గూడ  జైలులో పెట్టినా.. లొంగిపోకుండా పోరాడాను. నల్లమల అడవుల నుంచి దుర్మార్గులు, అవినీతిపరులను తొక్కుకుంటూ వచ్చాను. కార్యకర్తల అండ ఉన్నంతకాలం నా కుర్చీని ఎవరూ తాకలేరు" అని స్పష్టం చేశారు.


గత ప్రభుత్వంలో అణచివేతకు గురికాని వర్గమంటూ లేదని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కార్యకర్తల శ్రమ, రక్తం ఉందని.. వాళ్ల రుణం తీర్చుకుంటామని తెలిపారు. ఎంపీలను గెలిపించడంతోనే తమ బాధ్యత తీరిపోదని, పార్టీ జెండా మోసిన వారికి న్యాయం చేస్తామని వెల్లడించారు. “ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైంది? కేడీ.. మోదీ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. ఇద్దరూ కలిసి కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు నాటకాలు ఆడుతున్నారు. త్వరలో మెగా డీఎస్సీ వేసి భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మళ్లీ ఇందిరమ్మ కమిటీలను పునరుద్ధరిస్తాం. కాంగ్రెస్ అభయహస్తం హామీలను ఇంటింటికీ కార్యకర్తలు తీసుకెళ్లాలి" అని దిశానిర్దేశం చేశారు.

తెలంగాణను కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారు

 ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క భట్టి మాట్లాడుతూ మిగులు నిదులు నిధులతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని గత ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి ఈ ప్రాంతానికి నీరు రాకుండా చేసిందని విమర్శించారు. తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును నిపుణులు, ఇంజినీర్లు వద్దంటున్నా మేడిగడ్డ వద్ద కట్టారని  లక్ష కోట్ల నిధులు గోదావరిలో పోసి వృథా చేశారని ధ్వజ మెత్తారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు